Guntur Kaaram : ఉగాదికి టీవీల్లోకి గుంటూరు కారం

Guntur Kaaram : ఉగాదికి టీవీల్లోకి  గుంటూరు కారం

సూపర్‌స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) మూవీ టీవీల్లోకి వచ్చేస్తోంది. ఏప్రిల్ 9న ఉగాది పండుగ సందర్భంగా జెమిని టీవీలో ఈ సినిమా ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను జెమిని టీవీలో రిలీజ్ చేశారు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జెమినీ టీవీ భారీ ధరకు దగ్గించుకుంది. ఈ క్రమంలోనే పండుగ సమయంలో సినిమాని టెలికాస్ట్ చేస్తే మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారట.

అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్ - మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో ఆడియన్స్ తో పాటూ ఇండస్ట్రీ వర్గాల్లోనూ సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే రిలీజ్ తర్వాత సినిమాకి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. ఫ్యామిలీ ఆడియన్స్, మహేష్ ఫ్యాన్స్ ని తప్పితే నార్మల్ ఆడియన్స్ ని ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది.ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ, జగపతిబాబు, జయరామ్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.

మహేష్ బాబు తన తదుపరి సినిమాని ఎస్.ఎస్ రాజమౌళితో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుని పాన్ వరల్డ్ లెవెల్ లో సుమారు రూ.1000 నుంచి రూ.1200 కోట్ల బడ్జెట్ తో రూపొందించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. ఆల్రెడీ స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టుని ఏప్రిల్ నెలలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story