Hanuman : అమిత్ షాను కలిసిన హనుమాన్ టీమ్

Hanuman : అమిత్ షాను కలిసిన హనుమాన్ టీమ్

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను (Amit Shah) ‘హనుమాన్’ మూవీ హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కలిశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సమక్షంలో ఈ భేటీ జరిగింది. ఈ క్రమంలో హను మాన్ ప్రతిమను అమిత్ షాకి హనుమంతుడి విగ్రహన్ని బహూకరించారు. అమిత్ షాను కలవడం సంతోషంగా ఉందని ప్రశాంత్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో విడుదలైన ‘హనుమాన్’ సినిమా సూపర్ హిట్ టాక్‌తో రికార్డు కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే.

సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా హిట్ గా నిలవడమే కాకుండా.. దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక తేజ సజ్జాకి కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకువచ్చింది. సినిమా ఫలితాలు అను కూలంగా వచ్చిన నేపథ్యంలో తేజను అమిత్ షా అభినందించినట్లు చెబుతున్నా రు.

ఇక ఈ సమయంలో మరో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ సీని యర్ నేత కిషన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. ఇక హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి కూడా అమిత్ షాను కలిశారు. ఈ క్రమంలో హను మాన్ ప్రతిమను అమిత్ షాకి వారు బహూకరించారు. నిజానికి కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన అంతా అత్యంత రహస్యంగా నడిచింది. అమిత్ షా ఎప్పు డు, ఎక్కడ పర్యటిస్తారు? అనే అంశం మీద సొంత పార్టీ నేతలకే క్లారిటీ లేని పరిస్థితి.

Tags

Read MoreRead Less
Next Story