Jr NTR : రియల్ ఎస్టేట్‌లో మోసపోయిన జూనియర్ ఎన్టీఆర్

Jr NTR : రియల్ ఎస్టేట్‌లో మోసపోయిన జూనియర్ ఎన్టీఆర్

తెలుగు సినీ అగ్రనటుడు జూనియర్ ఎన్టీఆర్ తాను కొన్న స్థలం విషయంలో వివాదం తలెత్తడంతో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి 2003లో ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. అయితే ఆ భూమిని సుంకు గీత 1996లోనే బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. ఆ రుణాలను ఆమె ఎగ్గొట్టారు.

ఎస్‌బీఐ, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, ఇండ్‌స్ ఇండ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్యాంకులు సర్ఫేసీ యాక్ట్‌ కింద డెట్‌ రకవరీ ట్రైబ్యునల్‌ ను ఆశ్రయించాయి. విచారణ జరిపిన డీఆర్‌టీ.. ఆ స్థలంపై బ్యాంకులకే హక్కులుంటాయంటూ తీర్పు ఇచ్చింది. దీంతో.. జూనియర్ ఎన్టీఆర్ ఆ స్థలంతో పాటు అందులో కట్టుకున్న ఇల్లు కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. మోసం చేశారంటూ ఎన్టీఆర్ ఫిర్యాదుతో భూమి అమ్మిన గీతపై కేసు నమోదైంది. అటు డీఆర్టీ తీర్పుపైనా ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.

విచారణను వెకేషన్‌ బెంచ్‌ ముందు పోస్టు చేయాలని విజ్ఞప్తి చేసినా అందుకు ధర్మాసనం నిరాకరించింది. విచారణను జూన్‌ 6కు వాయిదా వేసింది. సుంకు గీత ఆ భూమిని బ్యాంకుల్లో తనఖా పెట్టిన విషయాన్న దాచి ఎన్టీఆర్ ను నమ్మించి మోసం చేసి అమ్మినట్టు చెబుతున్నారు పరిశ్రమ విశ్లేషకులు.

Tags

Next Story