Katrina Kaif : ఆ మాటలు నాలో కసి పెంచాయి : కత్రినా కైఫ్

Katrina Kaif : ఆ మాటలు నాలో కసి పెంచాయి  :  కత్రినా కైఫ్

తెలుగు ప్రేక్షకులకు వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించిన మల్లీశ్వరి (Malleswari) సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ కత్రినా కైఫ్. సౌత్ లో కెరీర్ ఆరంభంలో నటించిన ఈ అమ్మడు ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయ్యింది. హిందీ స్టార్స్ కి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా నిలిచి రెండు దశాబ్దాలుగా తన సత్తా చాటుతూ వస్తోంది. ప్ర స్తుతం ఇండియాస్ బెస్ట్ హీరోయిన్స్ లో నిలిచిన కత్రీనా కైఫ్ కెరీర్ ఆరంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొందట. కొందరు మొహానే ఈమెకు నటన రాదు, డాన్స్ రాదు సక్సెస్ అవ్వలేదు అన్నారట. అంతే కాకుండా చాలా మంది సినిమాలు వదిలి ఇంకా ఏమైనా ప్రయత్నించమని కూడా సలహాలు ఇచ్చారట.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో కత్రీనా కైఫ్ మా ట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో నేను సక్సెస్ అవ్వలేను అంటూ చాలా మంది నా మొహాన్నే చెప్పారు. అయినా నా ప్రయత్నాలు ఆపలేదు. అంతే కాకుండా మల్లీ శ్వరి సినిమా చేస్తున్న సమయంలో ఒక పాట చిత్రీకరణ చేస్తూ ఉండగా మైక్ లో ఈమెకు డాన్స్ చేయడం రాదని అందరి ముందు అన్నారు. ఆ మాటలు నాకు చాలా బాధ ను కలిగించాయి. కానీ నేను ఎప్పుడూ కుంగిపోలేదు. ఆ మాటలకు నేను ఏడ్చుకుంటూ ఆగి పోలేదు అంది.

ఒకవేళ ఆ మాటలకు నేను బాధ పడి ఏడ్చుకుంటూ ఉంటే కచ్చితంగా కెరీర్ లో ఈ స్థాయికి వచ్చి ఉండేదాన్ని కాదు అంటూ కత్రీనా కైఫ్ చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో ఆఫర్లు దక్కించుకునేందుకు ఎన్నో ఆడిషన్స్ చేయాల్సి వచ్చింద ని చెప్పిన కత్రీనా కైఫ్ ఇప్పటికి కూడా ప్రతి సినిమాకు ఎంతో కష్టపడి పని చేస్తాను అంది. విక్కీ కౌశల్ ని వివాహం చేసుకున్న తర్వాత కూడా కత్రీనా కైఫ్ కెరీర్ విషయంలో ఏ మాత్రం స్లో అవ్వలేదు. మరో దశాబ్ద కాలం పాటు ఈ అమ్మడి కొశాలు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story