Kiara Advani : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు కియారా అద్వానీ

Kiara Advani : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు కియారా అద్వానీ

భరత్ అనే నేను.. వినయ విధేయ రామ సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ఇప్పుడు రాంచరణ్ సరసన గేమ్ చేంజర్ సినిమాలో నటించబోతోంది. దక్షిణాదితోపాటు బాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడికి అంతర్జాతీయ వేదికపై సందడి చేసే అవకాశం దక్కింది. కియారా అద్వానీ.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 లో ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది.

కియారా అద్వానీ కేన్స్ లో వానిటీ ఫెయిర్ హోస్ట్ చేస్తున్న రెడ్ సీ ఫిల్మ్ ఫౌండేషన్ ఉమెన్ ఇన్ సినిమా గాలా డిన్నర్కు హాజరుకాబోతోంది. వివిధ దేశాలకు సంబంధించిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొంటారు. ఇండియా నుంచి కియారా అద్వానీతో పాటు ఐశ్వర్యరాయ్, శోభితా ధూళిపాళ, అదితి రావు హైదరీకి ఈ చాన్స్ దక్కింది.

ప్రస్తుతం ఈమె నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాను ఇదే ఏడాది లో విడుదల చేయాలనే ఉద్దేశంతో నిర్మాత దిల్ రాజు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ మధ్య ఉండే సన్నివేశాలు సినిమాకి అత్యంత కీలకంగా ఉంటాయన్నది టాక్.

Tags

Next Story