Manmadhudu : 22 ఏళ్ల తర్వాత కలిసిన మన్మథుడు జంట

Manmadhudu : 22 ఏళ్ల తర్వాత  కలిసిన మన్మథుడు జంట

నాగార్జున (Nagarjuna) కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రాల్లో 'మన్మథుడు' (Manmadhudu) ఉంటుంది. త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన ఈ చిత్రానికి విజయ భాస్కర్ దర్శకుడు. ఇందులో నాగార్జునతో పాటుగా సొనాలి బింద్రే, అన్షు నటించారు. అనుది కీలక పాత్ర. మహి పాత్రలో మెప్పించింది. మన్మథుడు తర్వాత మరో రెండు సినిమాల్లో మాత్రమే నటించింది. ఆ తర్వాత నటనకు దూరంగా ఉన్నారు. అను లండన్లో జన్మించింది. అక్కడే ఫ్యాషన్ డిజైనర్ గా పేరు తెచ్చుకుంది.

లండన్ కు చెందిన సచిన్ సగ్గర్ ను వివాహం చేసుకుంది. వీరికి ఒక కూతురు. లండన్లో స్థిరపడింది. అన్షు ఇటీవల ఇండియాకు వచ్చింది. హైదరాబాద్ లో తన స్నేహితలను కలుసుకుంటోంది. ఈ సందర్భంగా అను స్నేహితురాలు ఇచ్చిన పార్టీకి నాగార్జున, అమల హాజరయ్యారు. దాదాపు 22 ఏళ్ళ తర్వాత మన్మథుడు జంట కలుసుకున్నారు. నాటి అనుభవాలను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story