Nithya Menen : టాలీవుడ్ లో నిత్యమీనన్ రీఎంట్రీ

Nithya Menen : టాలీవుడ్ లో నిత్యమీనన్  రీఎంట్రీ

అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ నిత్యా మీనన్ ( Nithya Menen ). అనంతరం ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, ఓకే బంగారం లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఇట్టే కట్టి పడేసింది. తన క్యూట్ లుక్స్, అందం అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులపై చెరగని ముద్రవేసింది. ప్రస్తుతం తమిళంలో కాదలిక్క నేరమిల్లయ్, డియర్ ఎక్సెస్ సినిమాలను ఈ మలయాళ బ్యూటీ చేస్తోంది.

ఇకపోతే ఈ అమ్మడు టాలీవుడ్ లో సినిమాలు చేసి దాదాపు రెండేళ్లవుతుంది. దీంతో ఆమె టాలీవుడ్ రీఎంట్రీపై ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తమ్ముడు సినిమా తెరకెక్కుతుంది. ఇందులో నిత్య ఓ కీ రోల్ ప్లే చేయనున్నట్లు తెలుస్తోంది.

అతిథి పాత్రలో ఆమె కనిపించనున్నట్లు సమాచారం. కాగా గతంలో ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాల్లో నితిన్ కి జోడీగా నిత్య నటించింది. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. మరి తమ్ముడు సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో సప్తమీ గౌడ హీరోయిన్ గా నటిస్తోంది. నటి లయ ఓ కీలక పాత్ర చేస్తోంది.

Tags

Next Story