Rashmi : కుక్కను వెనుకేసుకొస్తావా? .. రష్మిపై నెటిజన్ల ఆగ్రహం

Rashmi : కుక్కను వెనుకేసుకొస్తావా?  .. రష్మిపై నెటిజన్ల ఆగ్రహం

ఇటీవల ఓ పసిబిడ్డను వీధికుక్క చంపిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై స్పందించిన నటి రష్మి.. బిడ్డపై దాడి జరుగుతుంటే తల్లిదండ్రులేం చేస్తున్నారంటూ ట్విటర్‌లో ప్రశ్నించారు. బాధ్యత లేకపోతే పిల్లల్ని కనొద్దంటూ తేల్చిచెప్పారు. బిడ్డను వారే రిస్కులో పెట్టారని విమర్శించారు. ఇది నెట్టింట దుమారానికి దారి తీసింది. బిడ్డ చనిపోతే మీరు కుక్కను వెనుకేసుకొస్తున్నారా అంటూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.

తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూర్‏లో పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే ఆ కుక్కను తల్లిదండ్రులు కొట్టి చంపేశారు. ఈ ఘటన పై ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ.. ‘ఇప్పుడు ఆ కుక్కను చంపినందుకు చిన్నారి తల్లిదండ్రుల మీద కేసు పెట్టాలని రష్మి అంటుంది’ అంటూ ట్వీట్ చేసింది రష్మి.

స్మాల్ స్ర్కీన్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈమె నిత్యం ఏదో ఒక విషయంపై స్పందిస్తూ ఉంటుంది. జంతువుల పట్ల దారణంగా వ్యవహరించడం, వాటిని హింసించడంపై అనేకసార్లు సీరియస్‌గా రియాక్ట్ అవుతూ, నిందితులను శిక్షించాలని పోస్టులు పెట్టడంతో జంతు ప్రేమికురాలిగా కూడా మంచి ఫేమ్ సంపాదించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story