Lalita Jewellery : కలిసొచ్చిన సావిత్రి బంగ్లా.. లలిత జ్యుయలర్స్ కిరణ్ కోట్ల వెనుక సీక్రెట్!

Lalita Jewellery : కలిసొచ్చిన సావిత్రి బంగ్లా.. లలిత జ్యుయలర్స్ కిరణ్ కోట్ల వెనుక సీక్రెట్!

సావిత్రి అంటేనే తెలుగు సినీ ప్రేమికులందరికీ ఓ ఆరాధ్య భావం. సక్సెస్ ఫుల్ గా తన జీవితాన్ని లీడ్ చేశారామె. స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తీరు.. ఆస్తిపాస్తులు సంపాదించుకున్న విధానం అంతా ఇప్పటికీ చాలామందికి స్ఫూర్తి. ఇబ్బందులతో వాటిని అమ్ముకున్న తీరు మరో వెర్షన్ అవుతుంది కానీ.. ఆమె జీవితంలో చూసిన ఆటుపోట్లు ఎంతోమందికి పాఠాలు నేర్పుతాయి. చెన్నైలోని హబీబుల్లా రోడ్డులో మూడు ఇండ్లు, కొడైకెనాల్లో ఓ ఇల్లు, హైదరాబాద్ యూసఫ్ గూడాలో రెండు ఇండ్లు సావిత్రికి ఉండేవట. సావిత్రి కూతురు చాముండేశ్వరి రీసెంట్ గా ఓ ప్లాట్ ఫామ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడి అయ్యాయి.

కష్టాల్లో ఉన్న సావిత్రి చాలా ఇండ్లను అమ్మేసింది. కొన్నింటిని ఆమె వారసులు అమ్మి మరోచోట ఆస్తులు కూడబెట్టుకున్నారు. ఐతే.. అలా ఇల్లు అమ్మేసిన వాటిల్లో ఒక ఇల్లును లలిత జువెలర్స్ ఓనర్ కిరణ్ కొనుగోలు చేసినట్టు చాముండేశ్వరి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇండ్లు పంచుకున్నప్పుడు.. విజయ్ చాముండేశ్వరి - సోదరుడు అమ్మకానికి పెట్టిన ఓ బిల్డింగ్ ను లలిత జ్యువెలరీ ఓనర్ కిరణ్ గుండు దక్కించుకున్నారట. సావిత్రి అంటే తనకు అభిమానమని.. అందుకే అదే ఇల్లు కొనుక్కుని అదే ఇంట్లో కొన్నాళ్లు ఆయన ఉన్నారని చాముండేశ్వరి చెప్పారు. సావిత్రి గారి ఆస్తే ఆయనకు కలిసొచ్చిందని చెప్పారు. సావిత్రిపైన అభిమానాన్ని కూడా పలు ఇంటర్వ్యూల్లో లలిత జ్యుయెలర్స్ అధినేత చెప్పడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story