Tillu Square : వంద కోట్ల క్లబ్ లోకి.. టిల్లు స్క్వేర్

Tillu Square : వంద కోట్ల క్లబ్ లోకి.. టిల్లు స్క్వేర్

డీజే టిల్లుకి సీక్వెల్ గా తెరకెక్కిన మూవీ 'టిల్లు స్క్వేర్' (Tillu Square). ఇందులో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించగా హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేసింది. మల్లిక్ రామ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ.. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే మొదట్లో కాస్త చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లూ రాబట్టని ఈ మూవీ.. ఈ వీకెండ్లో వంద కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టింది. రిలీజైన తొమ్మిది రోజుల్లోనే వరల్డ్ వైడ్గా వంద కోట్ల మార్క్ ను అందుకోవడం పెద్ద విశేషం. నటీనటుల రెమ్యూనరేషన్ పక్కన పెడితే.. 'టిల్లు స్క్వేర్' ప్రొడక్షన్ కాస్ట్ పది కోట్ల లోపే.

అలాంటిది ఈ సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించడం అంటే చిన్న విషయం కాదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్సీస్లోనూ ఈ సినిమా అదిరిపోయే వసూళ్లను సాధించింది. ఏకంగా 3 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. నైజాం ఏరియాలో పెద్ద హీరోల సినిమాల రేంజీలో 'టిల్లు స్క్వేర్'కు వసూళ్లు వచ్చాయి. ఇక్కడ ఆల్రెడీ గ్రాస్ రూ. 30 కోట్ల మార్కును దాటేసింది. రీసెంట్గా విడుదలైన 'ఫ్యామిలీ స్టార్' అంతగా ఆకట్టుకోకపోవడం, వచ్చే వారం 'గీతాంజలి మళ్లీ వచ్చింది' మినహా చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం టిల్లు స్క్వేర్ సినిమాకు కలిసొచ్చే అంశాలు.

Tags

Read MoreRead Less
Next Story