Tripti Dimri : ఆ టైమ్ లో నా గుండె బద్దలైంది : తృప్తి డిమ్రి

Tripti Dimri : ఆ టైమ్ లో నా  గుండె బద్దలైంది : తృప్తి డిమ్రి

ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది తృప్తి డిమ్రి. డైరెక్టర్ సందీప్ కిషన్ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాతో నేషనల్ క్రష్ అనే ట్యాగ్ అందుకుంది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీలో తృప్తి డిమ్రి సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఇందులో గ్లామర్ లుక్ జోయా పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా తృప్తి పేరు మారుమోగింది. ఈ సినిమాతో ఈ అమ్మడు ఫాలోయింగ్ సైతం మారిపోయింది. యానిమల్ తర్వాత కుర్రాళ్ల ఫేవరేట్ క్రష్ లిస్ట్ లో చేరిపోయింది తృప్తి. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. చేస్తూ బిజీగా ఉంటుంది. కానీ ఆమె సినీ పదేళ్లు కావొస్తుంది. మొదట్లో చిన్న చిన్న పాత్రలు తర్వాత కథానాయికగా అవకాశాలు అందుకుంది. ప్రయాణంపై ఎమోషనల్ కామెంట్స్ చేసింది తృప్తి.

ఆమె నటించిన లైలా మజ్ను, బుల్బుల్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఇదే విషయంపై తృప్తి మాట్లాడుతూ.. ఆ సమయంలో తన గుండె బద్దలైందని చెప్పుకొచ్చింది. 'లైలా మజ్ను విడుదల కాబోతున్నప్పుడు నేను పాలి మార్కెట్లో కూరగాయలు కొంటున్నాను. అప్పుడు నేను అద్దె అపార్ట్మెంట్లో నివసిస్తున్నాను. నా పనులు నేనే చేసుకునేదాన్ని. నేను నటించిన సినిమా విడుదలవుతుంది. ఆ సినిమా తర్వాత నన్ను అందరూ గుర్తిస్తారు అని అనుకున్నాను. అప్పుడు నేను బయటకు రావడానికి సంకోచించాను. కానీ విడుదలయ్యాక చాలా తక్కువ మంది సినిమా చూసేందుకు వెళ్లారు.

మేము అనుకున్నంతగా ఆ సినిమాకు రెస్పాన్స్ రాలేదు. అప్పుడు నా గుండె ముక్కలయ్యింది. ఆ తర్వాత నేను నటించిన ఏ సినిమా ఆకట్టుకోలేదు. తర్వాత చాలా అడిషన్స్ ఇచ్చింది. అప్పుడే బుల్బూల్ సినిమాలో ఆఫర్ వచ్చింది. దర్శకురాలు అన్వితా దత్ ను కలిశాను. ఆ సినిమాను థియేటర్లో విడుదల చేస్తారనుకున్నాను. కానీ ఓటీటీలో రిలీజ్ చేశారు. బుల్ బుల్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం నచ్చలేదు. కానీ నాకు కథ.. పాత్ర నచ్చింది. అందుకే ఇక మిగతా విషయాల గురించి ఆలోచించడంమానేశాను. సినిమా ప్రతిదీ మారుస్తుంది' అంటూ చెప్పుకొచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story