Priyamani : మతాంతర వివాహంతో ట్రోల్స్.. చాలా ఇబ్బంది పడ్డా: ప్రియమణి

Priyamani : మతాంతర వివాహంతో ట్రోల్స్.. చాలా ఇబ్బంది పడ్డా: ప్రియమణి

ప్రియమణి తెలుగులో చేసింది కొన్ని సినిమాలే. కానీ తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై అలరించడంతో పాటు అప్పుడప్పుడు సినిమా అవకాశాలు కూడా అందుకుంటూ ముందుకెళ్తోంది ప్రియమణి. ఎవరే అతగాడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పెళ్ళైనకొత్తలో, గోలీమార్, శంభో శివ శంభో, యమదొంగ మొదలగు తెలుగు చిత్రాలలో నటించింది. తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, మలయాళీ, తమిళ్ భాషల్లో నటించింది. ఎక్కువగా ట్రోలర్స్‌పై స్పందించని ఈ నటి.. ఈసారి మాత్రం వారికి చాలా గట్టి కౌంటర్‌నే ఇచ్చింది.

మతాంతర వివాహం చేసుకోవడం వల్ల సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నానని హీరోయిన్ ప్రియమణి తెలిపారు. దీనివల్ల తనతోపాటు పేరెంట్స్ కూడా ఇబ్బంది పడ్డారని చెప్పారు. ‘మైదాన్’ మూవీ ప్రమోషన్లలో మాట్లాడుతూ.. ‘ట్రోల్స్ విషయంలో భర్త నాకు అండగా నిలబడ్డాడు. ఏం జరిగినా చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. అలాంటి వ్యక్తి భర్తగా దొరకడం నా అదృష్టం’ అని పేర్కొన్నారు.

హీరోయిన్‌‌‌గా ఫుల్ బిజీగా ఉన్నప్పుడే ముస్తఫారాజ్‌‌‌‌ని ప్రేమించి పెళ్ళాడింది ఈ బ్యూటీ.. అయితే ప్రియమణిని పెళ్ళాడే సమయానికి ముస్తఫారాజ్‌‌‌‌కి భార్య కూడా ఉంది. ఆమె పేరు అయేషా. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ 2010 నుంచే విడివిడిగా బతుకుతున్నారు. ఈ క్రమంలో ముస్తఫారాజ్‌ 2017లో నటి ప్రియమణిని రెండో వివాహం చేసుకున్నాడు. రెండో పెళ్లి అనంతరం తన మొదటి భార్య పిల్లల కోసం ముస్తఫారాజ్‌ .. ప్రతి నెలా ఎంతో కొంత డబ్బు పంపిస్తూ వస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story