Anantapur : అనంతపురం జిల్లాలో పరువు హత్య కలకలం

Anantapur : అనంతపురం జిల్లాలో పరువు హత్య కలకలం
Anantapur : అనంతపురం జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కక్షతో కుళ్లాయిస్వామి అనే వ్యక్తి.. చెల్లెలి భర్త నరేంద్రను నరికి చంపాడు.

Anantapur : అనంతపురం జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కక్షతో కుళ్లాయిస్వామి అనే వ్యక్తి.. చెల్లెలి భర్త నరేంద్రను నరికి చంపాడు. వజ్రకరూరు మండలం వెంకటంపల్లిలో ఈ దారుణ హత్య చోటుచేసుకుంది. బుక్కరాయసముద్రం మండలం నీలారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నరేంద్ర అలియాస్ పోతి.. వెంకటంపల్లిలో బోయ కుళ్లాయిస్వామి వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పోతికి భార్యతో మనస్పర్థలు వచ్చి వేరుగా ఉంటున్నారు. అందుకు సంబంధించిన కేసు వజ్రకరూరు పోలీస్‌స్టేషన్‌లో నడుస్తోంది.

ఇక.. బోయ కుళ్లాయిస్వామి చెల్లెలు కుళ్లాయమ్మను పోతి.. రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. ఇద్దరూ కలిసి పామిడి మండలం కొనేపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నారు. కులాంతర వివాహం కావడం, తన వద్ద డ్రైవర్‌గా పనిచేసి తన చెల్లెలినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కుళ్లాయిస్వామి కక్ష పెంచుకున్నాడు. పోతిని మట్టుపెట్టేందుకు పక్కా ప్లాన్ వేశాడు.

అనుకున్న పథకం ప్రకారం సోమవారం సాయంత్రం జాకీ పనిచేయడం లేదని మరో డ్రైవర్‌తో పోతికి ఫోన్ చేయించాడు కుళ్లాయిస్వామి. ఆ డ్రైవర్ మాటలు నమ్మి బైక్‌పై ఇంటికి వచ్చిన పోతిని కుళ్లాయిస్వామి, వర్గీయులు కొడవలితో నరికి చంపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితులను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story