Indian Student Suicide: ఈ ఏడాది 8వ ఘటన.. కోటాలో మరో నీట్‌ స్టూడెంట్ సూసైడ్

Indian Student Suicide: ఈ ఏడాది 8వ ఘటన.. కోటాలో మరో నీట్‌ స్టూడెంట్ సూసైడ్

రాజస్థాన్‌లోని (Rajasthan) కోటాలో (Kota) నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET) కోసం సిద్ధమవుతున్న సమయంలో 19 ఏళ్ల విద్యార్థిని మార్చి 27న తన హాస్టల్‌లోని అద్దె గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఏడాది ఇది ఎనిమిదో ఆత్మహత్య కాగా, రెండు రోజుల్లో దేశంలోని 'కోచింగ్ హబ్'లో జరిగిన ఈ ఘటన రెండోది. బాధితురాలు సౌమ్య లక్నో నివాసి. నీట్‌కు ప్రిపరేషన్‌లో భాగంగా ఆమె ప్రైవేట్ కోచింగ్ తరగతులకు హాజరవుతోంది.

ఆమె మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సౌమ్య (Soumya) కుటుంబసభ్యులు కోటకు రాగానే పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఇదే తరహాలో మార్చి 25న, నీట్‌కు సిద్ధమవుతున్న విద్యార్థి ఉరుజ్ ఖాన్ (20) కోటలోని తన అద్దె గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. అతను ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌కు చెందినవాడు. విద్యార్థి ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడో పోలీసులు ఆరా తీస్తున్నారు.

గతేడాది నీట్‌కు సిద్ధమవుతున్న సమయంలో కోటాలో 29 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత ఏడాది నవంబర్‌లో, నీట్ వంటి ప్రవేశ పరీక్షలలో రాణించడానికి తమ పిల్లలపై అనవసరమైన ఒత్తిడి తెచ్చినందుకు తల్లిదండ్రులు, సంస్థలను సుప్రీంకోర్టు నిందించింది. ప్రైవేట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను నియంత్రించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story