Cricket Bettings : భర్త క్రికెట్ బెట్టింగ్ .. భార్య ఆత్మహత్య

Cricket Bettings : భర్త క్రికెట్ బెట్టింగ్ .. భార్య ఆత్మహత్య

క్రికెట్ బెట్టింగ్ వ్యసనం కర్ణాటకలో (Karnataka) ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. బెట్టింగులకు బానిసైన భర్త కోటి రూపా యల దాకా అప్పుచేయడంతో, అప్పులు ఇచ్చిన వ్యక్తుల దూషణలు, ఒత్తిళ్లు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుం ది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ పట్టణంలో చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ దిశగా దర్యాప్తు చేపట్టారు.

చిత్రదుర్గకు చెందిన దర్శన్ బాబు, రంజిత దంపతు లు. వీరిద్దరికి 2020లో వివాహమైంది. మొదట్లో దర్శన్ బాబు బెట్టింగ్ వ్యవహారం అంతా గుట్టుగా సాగింది. 2021 లో ఈవిషయం రంజితకు తెలిసి భర్తను వారించింది. అయి నా అతడు వ్యసనాన్ని విడిచిపెట్టలేదు. బెట్టింగ్ కోసం దాదాపు 1.5 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. కొంత కాలం తర్వాత అప్పులు ఇచ్చిన వాళ్లు ఇంటిపైకి రావడం మొదలు పెట్టారు.

క్రమంగా వారినుంచి ఒత్తిళ్లు పెరిగాయి. వచ్చినప్పుడల్లా దూషణలకు దిగుతుండేవారు. దాంతో ఆస్తులన్నీ అమ్మి రూ. 66 లక్షల వరకు అప్పు తీర్చాడు. మరో రూ.84 లక్షల అప్పు మిగిలింది. ఈ మొత్తం తీర్చే దారిలేక ని స్సహాయుడై ఇంటికే పరిమితం అయ్యాడు. దాంతో అప్పుల వాళ్లు అతడి భార్య రంజితను నిలదీయసాగారు. సూటి పోటి మాటలతో వేధించసాగారు. దాంతో మనస్తాపం చెంది. న ఆమె ఈనెల 18న బలవన్మరణానికి పాల్పడింది.

Tags

Read MoreRead Less
Next Story