రోడ్డు ప్రమాదంలో ఎక్సైజ్ సీఐ మృతి

X
By - Manikanta |14 Feb 2024 10:47 AM IST
హైదరాబాద్ (Hyderabad) లోని ఎల్బీనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన కారు బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న ఎక్సైజ్ సీఐ సాధిక్ అలీ మృతి చెందాడు. మరో ఎస్సై మొహినుద్దీన్ తీవ్ర గాయాలు అయ్యాయి. సీఐ సాధిక్ అలీ, ఎస్సై మొహినుద్దీన్ మలక్పేట్లోని ప్రభుత్వ క్వార్టర్స్లో ఉంటున్నారు.
ఎల్బీనగర్లో ఓ ఫంక్షన్ కు వెళ్లి వస్తున్న టైమ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కారులో ఉన్న డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పారిపోయారు..దుర్ఘటనను గమనించిన స్థానికులు పోలీసులుకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com