Dog : కుక్కను పెంచుకుంటున్నారా.. జాగ్రత్త! వైజాగ్ లో కుక్కకాటుతో తండ్రి, కొడుకు మృతి

విశాఖ పట్నం జిల్లాలోని భీమిలిలో దారుణం చోటుచేసుకుంది. నరసింగరావు తన ఇంట్లో కొన్నేళ్లుగా కుక్కలను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఏమైందో కానీ.. కొన్నిరోజుల క్రితం..నరసింగరావు(59), ఆయన కుమారుడు భార్గవ్ (27)ను వారం క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది. భార్గవ్ను ముక్కు మీద, నరసింగరావును కాలిపై కరిచింది. ఇదిలా ఉండగా.. ఈ ఘటన జరిగిన 2 రోజులకు కుక్క తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే వారు అప్రమత్తమై యాంటీ రేబిస్ ఇంజక్షన్ తీసుకున్నారు.
కానీ అప్పటికే.. వారిలో కూడా కొన్ని హెల్త్ కండీషన్ కూడా పాడైనట్లు తెలుస్తోంది. వారిలో కూడా.. మెదడు, కాలేయం, ఇతర భాగాలకు రేబిస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ తండ్రి,కొడుకులు మరణించారు.ఈ ఘటన మాత్రం స్థానికంగా తీవ్రకలకలంగ మారింది. కుక్క కరవగానే.. గ్యాప్ ఇవ్వకుండా యాంటి రేబిస్ తీసుకుంటే.. ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేదికాదని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. పెంపుడు కుక్కలకు కూడా క్రమంతప్పకుండా.. డీవార్మింగ్, వ్యాక్సినేషన్ చేయించాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com