Nandyala: పెళ్లి అయిన మరుసటి రోజే వరుడు మృతి.. అనుమానాస్పద స్థితిలో..
By - Divya Reddy |25 Jun 2022 1:00 PM GMT
Nandyala: నంద్యాల జిల్లా వెలుగోడు మండలం బోయరేవుల గ్రామంలో పెళ్లి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.
Nandyala: నంద్యాల జిల్లా వెలుగోడు మండలం బోయరేవుల గ్రామంలో పెళ్లి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి అయిన మరుసటి రోజే వరుడు శివకుమార్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. నిన్న పెళ్లి సందర్బంగా భారీగా ఊరేగింపు చేశారు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న వరుడు శివకుమార్ తెల్లారే సరికి మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. వరుడు గ్రామానికి కిలోమీటర్ల దూరంలో రోడ్డుపక్కన గాయాలతో విగత జీవిగా పడిఉన్నాడు. అతన్ని అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com