Indian Journalist : అమెరికాలో భారత జర్నలిస్టు మృతి

Indian Journalist : అమెరికాలో భారత జర్నలిస్టు మృతి

America : అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో భారత్ కు చెందిన ఫాజిల్ ఖాన్ (27) అనే జర్నలిస్టు మృతి చెందాడు. న్యూయర్క్ నగరం లోని ఓ అపార్ట్మెంట్లో ఈ ప్రమాదం జరిగింది. ఫాజిల్ ఖాన్ దేశంలోని ప్రముఖ మీడియా సంస్థల్లో కాపీ ఎడిటర్గా పనిచేశాడు. జర్నలిజంలో డిగ్రీ చేసేందుకు 2020లో న్యూయార్క్ వెళ్లి.. కొలంబియా జర్నలిజం స్కూల్లో కోర్సును పూర్తి చేశాడు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు.

కాగా తాను ఉంటున్న అపార్ట్మెంట్లో ఓ ఎలక్ట్రికల్ బైక్ లోని లిథియం అయాన్ బ్యా టరీలో మంటలు చెలరేగాయి. అవి వేగంగా వ్యాపించి భారీ అగ్ని ప్రమాదానికి దారి తీశాయి. ఈ ఘటనలో పాజిల్ ఖాన్ మృతి చెందగా.. సుమారు 17 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. పలువురు ప్రాణాలు దక్కించుకునేందుకు కిటికీల్లోంచి బయటకు దూకేశారు. .

ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని భారత్ తరలించేందుకు భారత రాయబార కార్యాలయం ప్రయత్నిస్తోందని అధికారులు తెలిపారు.

Tags

Next Story