Arrest : 20కి పైగా పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికొడుకు అరెస్ట్

దేశవ్యాప్తంగా 20కి పైగా వివాహాలు చేసుకున్న నిత్య పెళ్లికొడుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళల్ని నమ్మించి పెళ్లి చేసుకుని వారి నగలు, ఇతర విలువైన వస్తువులతో ఉడాయిస్తున్న 43 ఏళ్ల వ్యక్తిని మహారాష్ట్ర లోని పాల్టర్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆదివారం తెలిపారు.
నల్లా సోపారాకు చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు ఫిరోజ్ నియాజ్ షేక్ ను అరెస్ట్ చేశారు. నిందితుడు థానే జిల్లాలోని కళ్యాణికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతడిని జూలై 23న పోలీసులు పట్టుకున్నారు. ఫిర్యాదు చేసిన మహిళ చెప్పిన వివరాల ప్రకారం.. నిందితుడు మ్యాట్రిమోనీ వెబ్సైట్లో తనతో పరిచయం పెంచుకున్నట్లు పేర్కొంది.
రూ. లక్ష నగదు, ల్యాప్టాప్, ఇతర విలువైన వస్తువులను అతను తీసుకెళ్లినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. 2023 అక్టోబర్ మరియు నవంబర్ మహిళ వద్ద నుంచి రూ.6.5 లక్షలు తీసుకెళ్లాడని ఎఫ్ఎస్ఐఆర్ లో తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com