Police Raid : పేకాట స్థావరంపై పోలీసుల దాడి .. తప్పించుకునే క్రమంలో వ్యక్తి మృతి

Police Raid : పేకాట స్థావరంపై పోలీసుల దాడి ..  తప్పించుకునే క్రమంలో వ్యక్తి మృతి

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేయగా తప్పించుకునే క్రమంలో ఓ వ్యక్తి మూడవ అంతస్థుపై నుంచి దూకడంతో మృతి చెందిన ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... లాలాపేటలోని శాంతినగర్ కు చెందిన వినయ్ కుమార్(35) ప్రైవేటు ఉద్యోగి. గురువారం రాత్రి లక్ష్మీనగర్ ప్రాంతంలోని ఓ భవనంపై కొందరు వ్యక్తులు గుట్టు చప్పుడు కాకుండా పేకాట అడుతున్నారు. అయితే, వినయ్ కుమార్ అనే వ్యక్తి కూడా రాత్రి 10 గంటల సమయంలో అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పోలీసులను గమనించిన కొందరు జూదరులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. వినయ్ కుమార్ కూడా తప్పించుకునే ప్రయత్నంలో మూడవ అంతస్తు పైనుంచి కిందకు దూకాడు. దీంతో తీవ్ర గాయాలైన వినయ్ ను స్థానికులు అంబులెన్స్ ద్వారా సికింద్రాబాద్ లోని యశోదా ఆస్పత్రికి తరలించగా...చికిత్స పొందుతూ మృతి చెందాడు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న లాలాగూడ పోలీసులు.

Tags

Next Story