యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
By - Bhoopathi |29 Jun 2023 5:30 AM GMT
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది.ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ప్రమాద సమయంలో బస్సులో 30మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసుల ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com