Forgery Case : సంతకాల ఫోర్జరీ కేసు..ఏడుగురు నిందితుల అరెస్ట్​

Forgery Case : సంతకాల ఫోర్జరీ కేసు..ఏడుగురు నిందితుల అరెస్ట్​
X

సంతకాలు ఫోర్జరీ చేసి స్టాంప్​లు ఉపయోగించి అక్రమంగా ఇంటి నెంబర్లు కేటాయించి డబ్బులు సొమ్ము చేసుకున్న కేసులో ఏడుగురిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం...తన సంతకం ఫోర్జరీ చేసి అక్రమంగా ఇంటి నంబర్లు కేటాయించారంటూ పెద్దపల్లి జిల్లా రామగుండం ని* యోజకవర్గ పరిధిలోని అంతర్గాం టీటీఎస్​గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఇరుగురాల అనూజ ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ జరిపారు. కారోబార్​ బాణాల మహేశ్​, మాజీ సర్పంచ్​ కుర్ర వెంకటమ్మ, ఆమె భర్త నూకరాజు, పెరుమాళ్ల శేషుకుమార్​ కలిసి 30 మంది వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేసి అనూజ సంతకం ఫోర్జరీ చేసినట్టు గుర్తించారు. అనూజ పాస్​వర్డ్​ ఉపయోగించి ఆన్​లైన్​లో నకిలీ ఇంటి నెంబర్లను కేటాయించి రిజిస్ట్రేషన్​ చేసినట్టు తేల్చారు. దీంతో నలుగురు నిందితులతో పాటు కుర్ర మాథ్యూ, మద్ది అరుణ్​గౌడ్​, ఎం.సుమంత్​పై కేసు నమోదు చేసి జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్​కు తరలించినట్టు రామగుండం సీఐ టి.అజయ్​బాబు, ఎస్ఐ బి.వెంకటస్వామి తెలిపారు.

Tags

Next Story