America : ఆమెరికాలో కాజీపేట విద్యార్థి మృతి

America : ఆమెరికాలో కాజీపేట విద్యార్థి మృతి

అమెరికాలోని (America) ఫ్లోరిడాలో జరిగిన జెట్ స్కీ ప్రమాదంలో కాజీపేటకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. కాజీపేటకు చెందిన పిట్టల వెంకటరమణ ఇండియానా పోలీస్లో ని పర్డ్యూ యూనివర్సిటీలో హెల్త్ ఇన్ఫర్మాటి క్స్ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. మార్చి 9న యమహా పర్సనల్ వాటర్ క్రాఫ్ట్ (జెట్ స్కీ)ను అద్దెకు తీసుకొని అక్కడి ఫ్లోటింగ్ ప్లే గ్రౌండ్ లో నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో జెట్ స్కీ వేగంగా ఢీకొనడంతో వెంకటరమణ తీవ్రంగా గాయాలపాలయ్యాడు.

దాంతో వెంక టరమణను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించా రు. అయితే, అతడు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఫిజియోథెరపీలో డిగ్రీ పూర్తి చేసిన వెంకట రమణ.. ఏడాదిన్నర కిందట అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఇండియానా పోలీస్లోని పర్డ్యూ యూనివర్సిటీలో హెల్త్ ఇన్ఫ ర్మాటిక్స్ లో ఎంఎస్ చేస్తున్నాడు. మరో రెండు నెలల్లో ఎంఎస్ పూర్తికానుండగా ఇంతలోనే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

వెంకటరమణ మృతి విషయాన్ని భారత ఎంబసీ అధికారులు కుటుంబ సభ్యులకు సోమవారం రాత్రి తెలిపారు. మృతదేహం ఈనెల 18 లేదా 19న భారత్‌కు వస్తుందని సమాచారం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story