Protest Over Lover's Death : ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడి కుటుంబ సభ్యుల ఆందోళన.

రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మండలం,నూకలమర్రి గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడి మృతి దేహాన్ని వేసి ఆందోళన చేయడం నూకల మర్రి గ్రామంలో తీవ్ర కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నూకల మర్రి గ్రామానికి చెందిన పాలకుర్తి లింగయ్య,పద్మ దంపతుల కుమారుడు ప్రశాంత్ ( 22 ) తన ప్రియురాలు కోసం జూలై 5 న గడ్డి మందు తాగి ఆత్మహత్య పాల్పడగా చికిత్సా పొందుతూ , జూలై 12 న ఎల్లారెడ్డిపేట మండలం అశ్విని హాస్పిటల్ లో మృతిచెందాడు.కాగా ప్రశాంత్ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అదే గ్రామానికి చెందిన నాగుల లింగయ్య ఇంటి ముందు మృతదేహాన్ని వేసి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.నాగుల లింగయ్య కూతురు ,కొడుకు చేయవట్టే 3 నెలల్లోనే తన కూతురు నవ్య,కుమారుడు ప్రశాంత్ చనిపోయారు అని మృతదేహాన్ని ఇంటి ముందు వేసి ఆందోళనకు దిగారు.విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అందోళను విరమించడానికి ప్రయత్నించిన కూడా ఫలితం లేకుండా కుటుంబ సభ్యులు ఆందోళన చేయడంతో నులకమర్రి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com