HONOUR KILLING: ప్రేమించిందని కన్న కూతుర్నే కడతేర్చిన తండ్రి
చిత్తూరుజిల్లా కుప్పం - కర్నాటక సరిహద్దుల్లో పరువు హత్య జరిగింది. దళిత యువకుడిని ప్రేమిందన్న కోపంతో కూతుర్ని హత్య చేశాడో తండ్రి. ప్రియురాలి మరణవార్త తెలుసుకుని.. ఆ ప్రియుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కర్నాటక రాష్ట్రం కోలార్ జిల్లా బంగారుపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.బోడగుర్కికి చెందిన కీర్తి అదే గ్రామానికి చెందిన దళిత యువకుడు గంగాధర్ను ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న ఆమె తండ్రి కృష్ణమూర్తి కూతుర్ని గట్టిగా మందలించాడు. గంగాధర్ను మర్చిపోవాలని చెప్పాడు.అందుకు కీర్తి ససేమిరా అనడంతో ఆమెను గొంతు నులిమి చంపేశాడనే ఆరోపణలు ఉన్నాయి.కీర్తి చనిపోయిందని తెలుసుకున్న గంగాధర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్థుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కీర్తి తండ్రి కృష్ణమూర్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com