Tragedy : భార్యపై కిరోసిన్ పోసి సజీవ దహనం చేసిన భర్త

Tragedy : భార్యపై కిరోసిన్ పోసి సజీవ దహనం చేసిన భర్త

ఢిల్లీలోని (Delhi) రోహిణి ప్రాంతంలో ఓ భర్త.. భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించడంతో ఆమె కాలిన గాయాలతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన మార్చి 5న చోటుచేసుకుంది. "ఇంట్లో మంటలు చెలరేగి కొంతమంది చిక్కుకున్నట్లు బేగంపూర్ పోలీస్ స్టేషన్‌లో (Begampur Police Station) పోలీసు కంట్రోల్ రూమ్ (పిసిఆర్) కాల్ వచ్చింది. వెంటనే ఒక అగ్నిమాపక అధికారులు బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించి విషయం తెలుసుకున్నారు”అని సీనియర్ అధికారి చెప్పారు.

పోలీసులు ఇంటికి చేరుకుని చూడగా మెయిన్ గేటు లోపలి నుంచి తాళం వేసి ఉండటాన్ని గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారని అధికారి తెలిపారు.

"ఇంటిని పరిశీలించినప్పుడు, తీవ్రంగా కాలిన మహిళ అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు., అక్కడ వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారు" అని అధికారి తెలిపారు.

ఇంతలోనే కాలిన గాయాలతో మరణించిన మహిళకు ఆ వ్యక్తి భర్త అవుతాడని ఆ తరువాత పోలీసులు గుర్తించారు. త‌న తండ్రి త‌ల్లిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడ‌ని గాయ‌ప‌డ్డ బాలిక‌ల్లో ఒక‌రు పోలీసుల‌కి స‌మాచారం అందించారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story