Kadapa: కడపలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు వ్యక్తులు మృతి..

X
By - Divya Reddy |24 Aug 2022 2:00 PM IST
Kadapa: కడప జిల్లా పులివెందుల మండలంలోని నామాల గుండు వద్ద ఈతకు వెళ్లి.. ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
Kadapa: కడప జిల్లా పులివెందుల మండలంలోని నామాల గుండు వద్ద ఈతకు వెళ్లి.. ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ప్రొద్దుటూరుకు చెందిన గోపాల్ దాస్ నాని, సంజీవ్ కుమార్, బాల శేఖర్లు వ్యాపార నిమిత్తం.. కదిరికి వెళ్లి తిరిగి ప్రొద్దుటూరుకు బయలుదేరారు. మార్గమధ్యంలో పులివెందుల సమీపంలోని నామాల గుండు వద్ద నీరు ఉండటంతో ఈతకు దిగి ముగ్గురూ గల్లంతయ్యారు. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారికోసం గాలించి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com