Prakasam: మద్యం తాగొచ్చి వేధిస్తున్నాడంటూ భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య..

X
By - Divya Reddy |17 Jan 2022 12:51 PM IST
Prakasam: భర్త రోజూ మద్యం తాగొచ్చి వేధిస్తుండటంతో సహించలేకపోయింది ఆ ఇల్లాలు.
Prakasam: భర్త రోజూ మద్యం తాగొచ్చి వేధిస్తుండటంతో సహించలేకపోయింది ఆ ఇల్లాలు. దీంతో భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేసింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో జరిగింది. చిరంజీవి అనే వ్యక్తి రోజూ మద్యం తాగొచ్చి భార్యను వేధిస్తూ.. చంపుతానని బెదిరించేవాడని పోలీసులు తెలిపారు. వేధింపులు భరించలేక ఆమె పెట్రోల్ పోసి చంపినట్లు వెల్లడించారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com