TG : వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

TG : వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
X

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి కార్తీక శోభ సంతరించుకుంది. తొలి కార్తీక సోమవారం కావడంతో భక్తులతో కిటకిటలాడింది. రాజరాజేశ్వర స్వామి దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి 5 గంటలు, బ్రేక్‌‌‌‌‌‌‌‌ దర్శనానికి గంట టైం పడుతోంది. భారీగా తరలివచ్చిన భక్తులు తెల్లవారుజామున నుండే తలనీలాలు సమర్పించి, ధర్మగుండంలో స్నానం చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ ముందు ఉన్న రావిచెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించారు.

Tags

Next Story