TTD : తిరుమల లడ్డూ తయారీపై పుకార్లు నమ్మొద్దు: టీటీడీ

TTD : తిరుమల లడ్డూ తయారీపై పుకార్లు నమ్మొద్దు: టీటీడీ
X

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో ఎటువంటి అపోహలకు గురికావొద్దని టీటీడీ సూచించింది. ఎన్నో దశాబ్దాల నుంచి శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు సంప్రదాయానుసారంగా లడ్డూను తయారు చేస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపింది.

సోషల్ మీడియా వేదికగా టీటీడీపై అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తిరుమల శ్రీవారి పోటులో 980 మంది హిందూ మతానికి చెందిన పోటు కార్మికులకు నిర్దేశించిన వివిధ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని స్పష్టం చేసింది. వీరిలో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు లడ్డూల తయారీ, ముడి సరుకులు తీసుకురావడం వంటి పనులు చేస్తారని వివరించింది.

ఇతరలు, లడ్డూలను తరలించడం, ఉగ్రాణం, పడి పోటు, లడ్డు కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపింది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా శ్రీవారి లడ్డు ప్రసాదాలను థామస్ అనే కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారని అసత్య ప్రచారాలు వాస్తవం కాదని వెల్లడించింది.

Tags

Next Story