Actor Karthik Raju : శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు కార్తీక్ రాజు

Actor Karthik Raju : శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు కార్తీక్ రాజు
X

సినీ నటుడు కార్తీక్ రాజు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామం సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మీడియాతో కార్తీక్ రాజు మాట్లాడతూ.. శ్రీవారి దర్శనం అద్భుతంగా జరిగిందని అన్నారు. కౌసల్య కృష్ణమూర్తి సినిమా విడుదలకు ముందు శ్రీ వారిని దర్శించుకున్నానని తెలియజేశారు. ప్రస్తుతం 'అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్టలే' సినిమా షూటింగ్ ప్రారంభం అయినట్లు చెప్పారు. మరో రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Tags

Next Story