Jagannath Rath Yatra : జగన్నాథుడి రథానికి సుఖోయ్ టైర్లు.. 48 ఏళ్లలో తొలిసారి!

ఈ నెల 27న జగన్నాథుడి రథయాత్రను ఘనంగా నిర్వహించేందుకు పశ్చిమ బెంగాలకు చెందిన ఇస్కాన్ ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ఈసారి గతానికి భిన్నంగా స్వామి వారి రథానికి యుద్ధ విమానాల టైర్లు వాడాలని నిర్ణయించి.. ఆ మేరకు వాటిని అమర్చే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటి వరకు బోయింగ్ విమానాల టైర్లు వాడుతుండగా.. వాటిలో సమస్యలు రావడం గుర్తిం చిన నిర్వాహకులు.. ఈ దఫా ఫెటర్ జెట్ సుఖోయ్-30 కోసం తయారు చేసిన టైర్లను వాడాలని నిర్ణయించారు.
సుఖోయ్ టైర్లకు ఆర్డర్ పెట్టడంతో సదరు కంపెనీ ఆశ్చర్యపోయిందని, రథం సమస్యను వివరించగా వారు ఆలయానికి వచ్చి పరిశీ లించారని కోల్కతా ఇస్కాన్ ప్రతినిధి రాధారమన్ దాస్ తెలిపారు. అంతా సవ్యంగా సాగితే ఈసారి స్వామివారు సుఖోయ్ టైర్లు అమర్చిన రథంపై ఊరేగుతారని వెల్లడించారు. ఈ కొత్త టైర్లతో స్వామివారికి దాదాపు 48 ఏళ్ల తర్వాత కొత్త చక్రాలు లభిం చిన్నటైంది. జగన్నాథ రథం గంటకు 1.4 కిలోమీటర్ల వేగంతో నడుస్తుందని, సుఖోయ్ టైర్లు గంటకు 280 కిలోమీటర్ల వేగాన్ని కూడా తట్టుకోగలవని ఆలయ నిర్వాహకులు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com