Komuravelli : జనవరి రెండో వారం నుంచి 3 నెలల పాటు కొమురవెల్లిలో మహా జాతర

కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయంలో కళ్యాణ శోభ కనిపిస్తోంది. కళ్యాణం సందర్భంగా ఆలయ పరిసరాలను నాలుగు సెక్టార్లుగా విభజించి, 300 మంది బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 80 సీసీ కెమెరాలను సిద్ధం చేస్తున్నారు. కల్యాణోత్సవానికి వచ్చే భక్తుల వాహనాలను పార్కింగ్ చేసేందుకు ప్రత్యేకంగా స్థలాలను కేటాయించారు. వీఐపీల వాహనాలు తోటబావి ఎడమ వైపు, చేర్యాల, కిష్టంపేట నుంచి వచ్చే వెహికల్స్ను బస్టాండ్ సమీపంలో, కొండ పోచమ్మ దేవాలయం వైపు నుంచి వచ్చే వాహనాలను పద్మశాలి నిత్యాన్నదానసత్రం ఎదురుగా ఉన్న స్థలంలో పార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టారు. కల్యాణోత్సవాలు ముగిసిన తర్వాత జనవరి రెండో వారం నుంచి మూడు నెలల పాటు మహాజాతర జరగనుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు నెలల్లో పది వారాల పాటు జరిగే మహా జాతరకు సుమారు 10 లక్షల మంది భక్తులు మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. మహాజాతరలో భాగంగా 29న కల్యాణం, జనవరి 19న పట్నం వారం, 26న లష్కర్వారం, ఫిబ్రవరి 26 శివరాత్రి రోజన పెద్దపట్నం, మార్చి 23న అగ్నిగుండాలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com