TTD : తిరుమలలో లోకల్ దర్శనంపై స్థానికుల సంతోషం

తిరుమల స్థానికులకు శ్రీవారిని దర్శనం చేసుకునే అవకాశం కల్పించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో జరిగిన తొలి టీటీడీ బోర్డు సమావేశంలో స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో తిరుమల బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులుతో కలిసి టోకెన్ల జారీని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరించేందుకు తొలి బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తిరుమల, తిరుపతి రూరల్, అర్బన్, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు దర్శన కోటా ఖరారు చేసేందుకు టీటీడీ అధికారులు తీవ్ర కసరత్తు చేశారన్నారు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. సామాన్య భక్తులు, ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాకు ఎలాంటి అంతరాయం కలగకుండా స్థానికుల దర్శన కోటా పునరుద్ధరించామని చెప్పారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com