Maha Kumbh Spiritual : 10 వేల ఎకరాల్లో మహా కుంభ్ ఆధ్యాత్మిక క్షేత్రం

Maha Kumbh Spiritual : 10 వేల ఎకరాల్లో మహా కుంభ్ ఆధ్యాత్మిక క్షేత్రం
X

మహాకుంభమేళా కోసం ప్రయాగ్‌ రాజ్‌ను అందంగా ముస్తాబయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధువులు, సాధ్వీలు, నాగా సాధువులు, భక్తులకు స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే చాలా మంది ప్రయాగ్‌ రాజ్‌కు చేరుకున్నారు. 10 వేల ఎకరాల పరిధిలో ఈ ఆధ్యాత్మిక నగరాన్ని ఏర్పాటు చేశారు. యాత్రికులకు ఇబ్బంది లేకుండా 1.6 లక్షల టెంట్లను, 1.5 లక్షల మరుగు దొడ్లను నిర్మించారు. 1,250 కిలోమీటర్ల పైపులైన్లతో 50 వేల నీటి కనెక్షన్లు ఇచ్చారు. 400 కిలోమీటర్ల తాత్కాలిక రోడ్లను, 30 బల్లకట్టు వంతెనలను నిర్మించారు. పారిశుద్ధ్య నిర్వహణకు 15 వేల మంది శానిటేషన్‌ సిబ్బందిని నియమించారు. మహా కుంభ్‌నగర్‌ ప్రపంచంలోనే అతిపెద్ద తాత్కాలిక నగరంగా నిలుస్తోంది. ఏ సమయంలోనైనా 50 లక్షల నుంచి కోటి మంది వరకు వసతి కల్పించే సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. భక్తుల భద్రతకు యూపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. పటిష్ఠ నిఘా కోసం డ్రోన్లను వినియోగిస్తోంది. ఏఐ సహకారంతో కెమెరాల ద్వారా నిఘాకు చర్యలు చేపట్టింది. 55 పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశారు. 45 వేల మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సామాజిక మాధ్యమాలపై కూడా నిరంతరం నిఘా ఉంచనున్నారు.

Tags

Next Story