TTD : ఆఫ్ లైన్‌లో శ్రీవారి దర్శనం టికెట్ల కోటా 1000 మాత్రమే

TTD : ఆఫ్ లైన్‌లో శ్రీవారి దర్శనం టికెట్ల కోటా 1000 మాత్రమే
X

తిరుమల శ్రీవారి దర్శనానికి పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా, సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచే చర్యలు తీసుకుంటోంది. జూలై 22వ తేదీ నుండి శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ రోజుకు 1,000కి పరిమితం చేసింది. ఇందులో భాగంగా ఇదివరకు ఉన్నట్లే ఆన్ లైన్ లో 500, ఆఫ్లైన్లో 1,000 టికెట్లను జారీ చేస్తారు.

తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900 శ్రీవాణి టికెట్లను మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికగా జారీ చేస్తారు. శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్లో 100 టికెట్లు అందుబాటులో ఉంచారు. బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్లో మాత్రమే ఆఫ్లైన్ టిక్కెట్లు జారీ చేస్తారు.

భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించవలసిందిగా కోరింది.

Tags

Next Story