Sonu Sood : శ్రీవారిని దర్శించుకున్న సోనూ సూద్

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామం సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మీడియాతో సోనూ సూద్ మాట్లాడతూ… సిని పరిశ్రమలో అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకొని 26 ఏటా అడుగు పెట్టానని తెలిపారు. కళ్ళలగన్ లో నటించినట్లు తెలియజేశారు. కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. నూతన ప్రాజెక్ట్ నంబీ షూటింగ్ దశలో ఉందని ఈ సినిమాలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలియజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com