TTD EO Syamala Rao : ఒంటిమిట్టలో పూర్తి స్థాయిలో అన్నప్రసాద వితరణకు చర్యలు

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో భక్తులకు పూర్తి స్థాయిలో అన్నప్రసాద వితరణకు చర్యలు చేపట్టాలని టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని కార్యానిర్వాహణాధికారి ఛాంబర్ లో జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మంతో కలిసి సోమవారం అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఒంటిమిట్టలో ఏప్రిల్ 11వ తేదీన జరిగిన శ్రీకోదండరామ స్వామి కల్యాణోత్సవంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తరహాలో ఒంటిమిట్టలో భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఒంటిమిట్టలో భక్తులకు పూర్తి స్థాయిలో అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు . ఆలయం వద్ద ప్రస్తుతం తాత్కాళికంగా జర్మన్ షెడ్స్ ఏర్పాటు చేసి ఆగష్టు మాసం నుండి అన్నప్రసాదాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేందుకు ఇంజనీరింగ్, అన్నప్రసాదాల విభాగం అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. అన్నప్రసాదాల వితరణకు అవసరమైన మౌళిక సదుపాయాలు, వంట సామాగ్రి, అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్ఏ అండ్ సీఏవో శ్రీ ఓ. బాలాజీ, సీఈ శ్రీ టివి సత్యనారాయణ, ఎస్.ఈలు శ్రీ జగదీశ్వర్ రెడ్డి, శ్రీ మనోహరం, అన్నప్రసాదం డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com