Tirupati : తిరుమలలో ఉట్లోత్సవ వైభవం.. స్పెషాలిటీ ఇదే

X
By - Manikanta |29 Aug 2024 3:00 PM IST
కృష్ణాష్టమి వేడుకల్లో తిరుమలలో ఘనంగా జరిగాయి. నిన్న సాయంత్రం ఉట్లోత్సవంతో ఈ వేడుక ముగిసింది. శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించిన మర్నాడు ఉట్లోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా మలయప్ప స్వామిని బంగారు తిరుచ్చిపై, శ్రీ కృష్ణస్వామిని మరో తిరుచ్చిపై తిరు వీధులలో ఊరేగించారు.
అనంతరం ఉత్సవ మూర్తులను పెద్ద జీయర్ మఠానికి తీసుకువచ్చి అక్కడ ఆస్థానం నిర్వహించారు. తరువాత శ్రీవారి ఆలయం ఎదుట ఉట్లోత్సవం వైభవంగా జరిగింది.
ఈ వేడుకలు చూసేందుకు భక్తజనం పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఏడాదికోసారి వైభవంగా జరిగే ఉట్లోత్సవం చూసి సంబురపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com