TTD : శ్రీవారి ఆలయంపై నుంచి ఎగిరిన హెలికాప్టర్.. భక్తుల ఆందోళన

తిరుమలలో మరోసారి కలకలం రేగింది. ఆగమశాస్త్రాన్ని వ్యతిరేకంగా హెలికాప్టర్ శ్రీవారి ఆలయంపై నుంచి వెళ్లింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరగగా.. ఈ సారి ఏకంగా తక్కువ ఎత్తులో ఆలయం పైనుంచి హెలికాప్టర్ వెళ్లింది. దీంతో వెంకన్న భక్తులు ఆందోళన చెందుతున్నారు. టిటిడి విజిలెన్స్ అధికారులు విమాయానశాఖకి ప్రతిపాదనలు పంపినా ఆగమశాస్త్రాని పక్కన పెట్టేస్తున్నారు. ఇలా అయితే ఉగ్ర దాడికి అవకాశాలు ఉన్నాయని శ్రీవారి భక్తులు ఆవేదన చెందుతున్నారు. శ్రీవారి ఆలయంతో పాటు తిరుమల కొండపై విమానాల రాకపోకలు సాగించవద్దని టీటీడీ అధికారులు ఇప్పటికే పలుమార్లు విమానయాన శాఖకు విజ్ఞప్తి చేసినప్పటికీ.. రేణిగుంట విమానాశ్రయానికి ఉన్న హెవీ ట్రాఫిక్ నేపథ్యంలో తిరుమల కొండపై విమానరాకపోకలు నిలిపివేయలేమని.. అయితే శ్రీవారి ఆలయం సమీపంలో విమాన రాకపోకలు చేయబోమని టీటీడీ అధికారులకు స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com