TTD : సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై టీటీడీ ఫైర్

TTD : సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై టీటీడీ ఫైర్
X

వృద్ధుల దర్శనంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని భక్తులకు తితిదే విజ్ఞప్తి చేసింది. రోజూ వెయ్యి మంది వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పిస్తున్నామని తెలిపింది. మూడు నెలల ముందే ప్రతినెలా 23న ఆన్లైన్ కోటా విడుదల చేస్తున్నామని పేర్కొంది.

తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పీహెచ్సీ లైన్ ద్వారా రోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారని వెల్లడించింది. భక్తులు సరైన సమాచారానికి తితిదే అధికారిక వెబ్ సైట్ ను మాత్రమే సంప్రదించాలని సూచించింది.

Tags

Next Story