TTD : సెప్టెంబర్ నెల తిరుమల దర్శన కోటా విడుదల

తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈనెల 20వ తేది ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ టికెట్లు పొందిన వారు జూన్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్ టికెట్లు మంజూరు అవుతాయి. అదేవిధంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఈనెల 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అలాగే వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఈనెల 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈనెల 23న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్లైన్ కోటాను ఈనెల 23వ తేది ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాదులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల కోటాను ఈనెల 23న మధ్యాహ్నం నాడు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఈనెల 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అలాగే తిరుమల-తిరుపతిలో గదుల కోటాను ఈనెల 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తుంది. శ్రీవారి సేవ (తిరుమల-తిరుపతి), పరకామణి సేవ, నవనీతసేవ, గ్రూప్ సూపర్వైజర్ల సేవల ఆగస్టు నెల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తుంది. టీటీడీ వెబ్సైట్ ద్వారా శ్రీవారి అర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com