ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం.. 44 వేల మృతులు, లక్షల్లో నిరాశ్రయులు

గాజాలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా గత 48 గంటల్లో కనీసం 55 మంది పాలస్తీనియన్లు మరణించారని, 110 మంది గాయపడ్డారని గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయిల్ దాడుల కారణంగా గాజా మొత్తం ధ్వంసమైంది. లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, గాజాలో 44,000 మందికి పైగా పాలస్తీనా పౌరులు మరణించారు, గాయపడిన వారి సంఖ్య 104,008 కంటే ఎక్కువ. గత 48 గంటల్లో గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 55 మంది పాలస్తీనియన్లు మరణించారని, మరో 110 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని పంచుకుంది. మరోవైపు, హమాస్ నేతలకు ఆతిథ్యం ఇవ్వడంపై అమెరికా టర్కీని హెచ్చరించింది. ఇకపై పాలస్తీనా ఉగ్రవాద సంస్థతో మునుపటిలా పని చేయలేమని అమెరికా పేర్కొంది.
ఖతార్ రాజధాని దోహాలోని హమాస్ రాజకీయ కార్యాలయం మూసివేయబడింది. హమాస్ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com