దేశంలో మళ్లీ పెరుగుతున్న కేసులు.. కొత్తగా 88,600 మందికి..

X
By - shanmukha |27 Sept 2020 11:15 AM IST
ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా.. భారత్ లో మళ్లీ విజృంభిస్తున్నట్టు కనిపిస్తుంది.
ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా.. భారత్ లో మళ్లీ విజృంభిస్తున్నట్టు కనిపిస్తుంది. శనివారం 86వేల కేసులు దాటి నమోదవ్వగా.. ఆదివారం 88 వేలు మందికి పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 88,600 మందికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 5,992,533కు చేరాయి. అయితే ఇప్పటివరకూ 49,41,628 మంది కరోనా నుంచి కోలుకోగా.. 9,56,402 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. అటు ఒక్కరోజులో 1124 మంది కరోనాతో మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 94,503కు చేరింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com