Corona: భారీగా తగ్గిన కరోనా కేసులు..

దేశం ఊపిరి పీల్చుకుంటోంది. వైరస్ వ్యాప్తి అదుపులో ఉంది. తాజాగా కొత్త కేసులు 19 శాత మేర తగ్గి 25 వేలకు చేరాయి. క్రియాశీల రేటు, రికవరీ రేటు మెరుగ్గా ఉండడం ఊరటనిస్తోంది. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా గణాంకాలను విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 25,072 మంది మహమ్మారి బారిన పడగా 389 మంది మృత్యువాతకు గురయ్యారు. మొత్తం కేసులు 3.24 కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,34,756గా ఉంది. నిన్న 44,157 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.16 కోట్లకు చేరాయి. కొద్ది రోజులుగా క్రియాశీల కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 3,33,924 మంది కోవిడ్తో బాధపడుతున్నారు. మరోపక్క నిన్న కేవలం 7,95,543 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఱ్య 58.25 కోట్లకు చేరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com