Corona Update: రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి.. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి: కేంద్ర ఆరోగ్య మంత్రి
By - Prasanna |8 April 2023 5:42 AM GMT
Corona Update: రాబోయే రెండు రోజులలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించాలని ఏప్రిల్ 10, 11 తేదీలలో మాక్ డ్రిల్లు నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా రాష్ట్ర ఆరోగ్య మంత్రులను కోరారు.
Corona Update: రాబోయే రెండు రోజులలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించాలని ఏప్రిల్ 10, 11 తేదీలలో మాక్ డ్రిల్లు నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా రాష్ట్ర ఆరోగ్య మంత్రులను కోరారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నందున కేంద్ర ఆరోగ్య మంత్రి శుక్రవారం రాష్ట్ర ఆరోగ్య మంత్రులతో వర్చువల్ సమావేశం మాట్లాడారు. కోవిడ్ పరీక్షలను వేగవంతం చేయాలని, ఇన్ఫ్లుఎంజా లాంటి అనారోగ్య కేసులను గుర్తించాలని కోరారు. ఆరోగ్య శాఖ పంచుకున్న డేటా ప్రకారం, ఢిల్లీలో శుక్రవారం 733 తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది ఏడు నెలల్లో అత్యధికంగా 19.93 శాతం పాజిటివ్ రేటుతో నమోదైంది. నగరంలో మరో ఇద్దరు కోవిడ్-పాజిటివ్ వ్యక్తులు మరణించినట్లు హెల్త్ బులెటిన్ తెలిపింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com