corona update:మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. తాజాగా..

X
By - Gunnesh UV |21 July 2021 10:44 AM IST
దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. నిన్న 30వేల కేసులు నమోదు కాగా.. తాజాగా ..
corona update: దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. నిన్న 30వేల కేసులు నమోదు కాగా.. తాజాగా 42వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన రేపుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 42 వేల 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3కోట్ల 12 లక్షల 16వేల 337కి చేరుకుంది.
తాజాగా మరో 3వేల 998మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 4లక్షల 18వేల 480కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4 లక్షల 7వేల 170 యాక్టివ్ కేసులున్నాయిని కేంద్రం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.87 శాతానికి పెరిగింది. దేశంలో ఇప్పటివరకూ 41.54 కోట్ల మందికిపైగా కరోనా టీకా అందించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com