Chandrababu : జంగారెడ్డి గూడెంలో చంద్రబాబు పర్యటన.. బాధిత కుటుంబాలకు పరామర్శ
Chandrababu : కల్తీ సారా బాగోతం బయటపెట్టేంత వరకు ప్రభుత్వాన్ని విడిచి పెట్టేది లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఆయన పర్యటించారు. నాటుసారా తాగి చనిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోయామంటూ చంద్రబాబు ముందు బోరున విలపించారు బాధితులు. న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చారు చంద్రబాబు. ఇక ఇప్పటికే పార్టీ తరఫున బాధిత కుటుంబాలకు 10వేల రూపాయల సాయం అందజేశారు.
జంగారెడ్డిగూడెంలో 19మంది చనిపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అంటూ మండిపడ్డారు. మద్యనిషేదం అన్న జగన్... మాటతప్పి సొంత బ్రాండ్లు దించి ప్రజల్ని దండుకోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. సారా మరణాలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అటు సారా మృతుల కుటుంబాలకు 25లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విషయాన్ని అంత తేలిగ్గా విడిచిపెట్టమంటూ హెచ్చరికలు జారీ చేశారు చంద్రబాబు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com