Paytm Layoffs : పేటీఎంలో లేఆఫ్స్.. ఖర్చు తగ్గించుకునే పనిలో కంపెనీ

Paytm Layoffs : పేటీఎంలో లేఆఫ్స్.. ఖర్చు తగ్గించుకునే పనిలో కంపెనీ
X

ఆర్బీఐ నిషేధంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పేటీఎం ప్రస్తుతం ఖర్చు తగ్గించుకునే పనిలో పడింది. ఇందుకోసం ఉద్యోగులపై వేటు వేయాలని భావిస్తోంది. మొత్తం వర్క్ ఫోర్స్ లో 15 - 20 శాతం ఉద్యోగులను ఇళ్లకు పంపాలని అనుకుంటోందట.

2024 ఆర్థిక సంవత్సరంలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని చూస్తోంది. 2023 ఆర్ధిక సంవత్సరంలో పేటీఎంలో 32 వేల 798 మంది ఉద్యోగులు ఉండేవారు. అందులో 29 వేల 503 మంది యాక్టివ్ వర్క్ ఫోర్స్ ఉన్నారు. ఆ సమయంలో ఒక్కో ఉద్యోగి మీద పేటీఎం సరాసరిన 7 లక్షల 87 వేల రూపాయలు ఖర్చు చేసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల కోసం పెట్టాల్సిన ఖర్చు 34 శాతం పెరగాలి. అంటే ఒక్కో ఉద్యోగి మీద పేటీఎం 10 లక్షల 60 వేలు కంపెనీ ఖర్చు చేయాలన్నమాట.

తద్వారా ఏటా కంపెనీకి రూ.3 వేల 124 కోట్లు ఖర్చు అవుతుంది. నష్టాలను తగ్గించడానికి ఉద్యోగులపై వేటు వేయడమే మార్గమని పేటీఎం భావిస్తోంది. ఉద్యోగులను తొలగించడం ద్వారా రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఆదాయం సేవ్ చేయాలని కంపెనీ ప్రణాళికలు రచించింది. దాదాపు 5 వేల నుంచి 6 వేల 300 మంది ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉంది.

Tags

Next Story